నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Thursday, January 8, 2009

స్మృత్యంజలి

స్మైల్' ...ఖాళీ సీసాలు మృత్యు మధువుతో నింపి ఆకాశ చషకం లో ఆఖరి 'చుక్క'య్యాడు. జ్వాలాముఖి 'జై దిగంబరా నేనే పైగంబరా' అని నినాదాలిచ్చుకుంటూ తనకు తానే జోహార్లర్పిం చుకున్నాడు .
మన 'స్వస్థాన మిత్రుడు' కొత్తపల్లి అక్షరాల అంతరిక్షాల్లోకి వెలుతురుపిట్టలా ఎగిరి పోయాడు.
తెలుగిస్లాం పండితుడు... జనాబ్ ఖాద్రి .అల్లా కు ప్యారే అయ్యాడు.ఆయన స్థాయి గీటు రాయి .
తెలుగు సాహిత్యం లో నిలువెత్తు దివిటీలైన ఈ కళా మూర్తుల కాంతి కనుమరుగయింది.ఈ వెలితిని పూర్తి చెయ్యటానికి ఎన్ని కాంతి సంవత్సరాలు కావాలో !?
అయినా మృతియె లేకున్న రుచి యేది బ్రతుకులోన?!
పుట్ల హేమలత

2 comments:

Anonymous said...

hai hemalatha putla garu...ur blog is too good and very informative.i really appreciate ur active part in sahitya acedamy programs.ur poems r also highly subjective!hope to see u soon with a book of ur own.try to come up with an idea,bye dear,take care.

venkatesh said...

మీ కవితలు చాల బాగున్నవి అండీ.. మీ చిత్రాలు కుడా..