స్మైల్' ...ఖాళీ సీసాలు మృత్యు మధువుతో నింపి ఆకాశ చషకం లో ఆఖరి 'చుక్క'య్యాడు. జ్వాలాముఖి 'జై దిగంబరా నేనే పైగంబరా' అని నినాదాలిచ్చుకుంటూ తనకు తానే జోహార్లర్పిం చుకున్నాడు .మన 'స్వస్థాన మిత్రుడు' కొత్తపల్లి అక్షరాల అంతరిక్షాల్లోకి వెలుతురుపిట్టలా ఎగిరి పోయాడు.
తెలుగిస్లాం పండితుడు... జనాబ్ ఖాద్రి .అల్లా కు ప్యారే అయ్యాడు.ఆయన స్థాయి గీటు రాయి .
తెలుగు సాహిత్యం లో నిలువెత్తు దివిటీలైన ఈ కళా మూర్తుల కాంతి కనుమరుగయింది.ఈ వెలితిని పూర్తి చెయ్యటానికి ఎన్ని కాంతి సంవత్సరాలు కావాలో !?
అయినా మృతియె లేకున్న రుచి యేది బ్రతుకులోన?!
పుట్ల హేమలత


2 comments:
hai hemalatha putla garu...ur blog is too good and very informative.i really appreciate ur active part in sahitya acedamy programs.ur poems r also highly subjective!hope to see u soon with a book of ur own.try to come up with an idea,bye dear,take care.
మీ కవితలు చాల బాగున్నవి అండీ.. మీ చిత్రాలు కుడా..
Post a Comment