నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Friday, March 21, 2008

మనోజ్ఞ్య సాంస్కృతిక సాహిత్య అకాడమీ కార్యక్రమాలు

I started MANOGNYA Samskritika Sahitya Academy on 28th of october 2007.It is an open literary organaisation to all poets,writers and lovers of literature.Every month we organise one or two literary and cultural programmes in Rajahmundry and other places. VIHANGA Vanitha Vikasa Vedika also sister concern.it works about women rights, counselling ...child labour,  girl child abuse & live cheerful programmes for youth.

వ.సంఖ్య / కార్యక్రమ వివరాలు / స్థలము / తేది

1. / ప్రారంభోత్సవం / రాజమండ్రి / 27-10-2007
ముఖ్య అతిధి: శ్రీమతి మన్నెం శారద. నవల,కథా రచయిత్రి.



 2/తల్లావఝ్జల పతంజలి శాస్త్రి కథలు-విశ్లేషణ /రాజమండ్రి /18-11-2007
విశ్లేషకులు డీ.ఆర్ .ఇంద్ర.(కథా రచయిత)

' గ్రహాంతర వాసి' రాణీ శివ శంకర శర్మ నవల పై సమీక్ష 
సమీక్షకులు ;రచయిత ఎస్.వి.హెచ్.అలీ 

ఇంకా కవితా పఠనం ,సాహిత్య వార్తలు


3/మనోజ్ఞ్య సాంస్కృతిక సాహిత్య అకాడమీ సర్వ సభ్య సమావేశం /రాజమండ్రి/ 20-11-2007


4/సాహితీ సమావేశం / కవిసమ్మేళనం /ప్రముఖ కవి డా.ఎండ్లూరి సుధాకర్ తో ఆత్మీయ గోష్ఠి / నెల్లూరు/ 29/11/07
కవులు పెరుగు రామక్రిష్ణ ,ఖాదర్ షరీఫ్,వంజవాక సతీష్ కుమార్ రెడ్డి ,డా.ఆలూరి శిరోమణి శర్మ ,డా.ఈదూరి సుధాకర్,
మొదలైన వారు తమ కవితలు వినిపించారు.ప్రముఖ రచయిత్రి గోవిందరాజు సీతా దేవి తల్లి ప్రాముఖ్యతని గురించి వివరించారు.



5/కథా రచయిత 'పులికంటి క్రిష్ణారెడ్డి ' సంస్మరణ సభ/శ్రీ గౌతమీ గ్రంధాలయం/
రాజమండ్రి /20/12/2007
అధ్యక్షులు :అద్దేపల్లి రామమోహన రావు 
కోడూరి శ్రీరామమూర్తి
(రచయితలు)
డా.వింజమూరి లక్ష్మి కవితలు' భావ తరంగాలు' ఆవిష్కరణ .
ఆవిష్కర్త .డా.ఎండ్లూరి సుధాకర్,ఆత్మీయ అతిధి .సన్నిధానం నరసింహ శర్మ.



6/రచయిత,చిత్రకారుడు,తత్వ వేత్త 'సంజీవ్ దేవ్ ' జీవితం -రచనలు అనే అంశం పై రచయిత ,హై కోర్ట్ న్యాయవాది జితేంద్ర బాబు ప్రసంగం/రాజమండ్రి/27.1.2008.

7/ప్రముఖ కథా రచయిత,విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి రచించిన 'తెరతీయగ రాదా...' కధాసంపుటి ఆవిష్కరణ/రాజమండ్రి/24.2.2008.

వక్తలు-ముప్పిడి ప్రభాకర రావు,ఎండ్లూరి సుధాకర్ ,పతంజలి శాస్త్రి,ఆరెస్ వెంకటేశ్వర రావు.




8/అంతర్జాతీయ మహిళా దినోత్సవం/కవయిత్రీ సమ్మేళనం/స్తీల కళా నైపుణ్య ప్రదర్శన/ రాజమండ్రి /8.3.2008 


9/మనోజ్ఞ్య సాంస్కృతిక సాహిత్య అకాడమీ అనుబంధ వేదిక 'విహంగ వనితా వికాస వేదిక' ఆధ్వర్యం లో చర్చా గోష్టి/ రాజమండ్రి/12.3.2008.
అంశం:హింసాత్మక ప్రేమలు - పౌర భాధ్యతలు 
ప్రముఖ న్యాయవాదులు ,సైకాలజిస్టులు ,తల్లిదండ్రులు,యువత,నగర ప్రముఖులు పాల్గొన్నారు.



10/రాష్ట్ర స్థాయి శతాధిక ఉగాది కవిసమ్మేళనం/ఆనం రోటరీ హాల్/రాజమండ్రి/20.3.2008.
ప్రారంభకులు -నాగసూరి వేణుగోపాల్,ప్రయోక్త, ఆకాశవాణి,హైదరాబాద్ /
అధ్యక్షుడు -కవి యార్లగడ్డ మోహన రావు.
కె.రాజకుమారి కవితాసంపుటి 'భావ రాజీవం' ఆవిష్కరణ.
సభాద్యక్షుడు-ఎండ్లూరి సుధాకర్.
ముఖ్య అతిధి-అద్దేపల్లి రామ మోహన రావు.
ఆవిష్కర్త - ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ..