నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Sunday, October 12, 2008

మనోజ్ఞ్య సాంస్కృతిక సాహిత్య అకాడమీ కార్యక్రమాలు



11/వాసిరెడ్డి సీతాదేవి ప్రధమ వర్ధంతి -స్మారక సాహిత్య సదస్సు /రాజమండ్రి /13.4.2008.
వాసిరెడ్డి సీతాదేవి రచనలపై వ్యాసరచన పోటీ-బహుమతులు.
                     వక్తలు :వాడ్రేవు వీరలక్ష్మి దేవి,రచయిత్రి.
                      చాగంటి శరత్ బాబు. రచయిత.

12/మనోజ్ఞ్య సాంస్కృతిక సాహిత్య అకాడమీ,ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి సంయుక్త ఆద్వర్యం లో 
 ' స్నేహం- విశిష్టత ' అంశం పై వ్యాస రచన పోటీ,బహుమతులు.యూత్ కౌన్సిలింగ్  /రాజమండ్రి           /3.8.2008.


ముఖ్య అతిధి-సన్నిధానం నరసింహశర్మ.




13/ముప్పిడి ప్రభాకర రావు' లోకం చూశాక' కథాసంపుటి పై విశ్లేషణ /రాజమండ్రి/12.10.2008.


విశ్లేషకులు:మహీధర రామశాస్త్రి,రచయిత.