నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Sunday, December 7, 2008

'మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ ' కార్యక్రమాలు


14/మనోజ్ఞ్య సాంస్కృతిక సాహిత్య అకాడమీ,  కేంద్ర సాహిత్య అకాడమీబెంగళూరు . సంయుక్త ఆధ్వర్యం లో రోజుల పాటు సాహితీ ఉత్సవాలు ,సాహిత్య అకాడమీ వారి పుస్తక ప్రదర్శన /ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపం/
రాజమండ్రి/8.12.2008-10.12.2008 



0 comments: