నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Friday, October 23, 2015

అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్న వక్తలు



15. 10.2015 న డా. సి నా రె ఆవిష్కరించిన డా . పుట్ల హేమలత రచన 'అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్నఆచార్య గారపాటి ఉమామహేశ్వర రావు , భాషా శాస్త్ర విభాగం , హైదరాబాద్ 

సెంట్రల్ యూనివర్సిటీ. 

 



15. 10.2015 న డా. సి నా రె ఆవిష్కరించిన పుట్ల హేమలత రచన 'అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్న డా. దార్ల వెంకటేశ్వర రావు ,తెలుగు శాఖ , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ



15. 10.2015 న డా. సి నా రె ఆవిష్కరించిన పుట్ల  హేమలత  రచన 'అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ  సభలో ప్రసంగిస్తున్న 'కంప్యూటర్ ఎరా ' సంపాదకుడు శ్రీ నల్లమోతు శ్రీధర్ .

0 comments: